రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

,

మావోయిస్టులు రేపు (మంగళవారం) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఛతీస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అధినేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ కూడా ఉంది. వీరి ఈ మృతి నేపథ్యంలో తెలంగాణ బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా ఈ బందులో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు.