రాష్ట్రంలో రెండో డోస్‌ వ్యాక్సిన్‌నేషన్‌ ప్రారంభం

హైదరాబాద్‌: కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ రాష్ట్రంలో ప్రారంభమైంది. తొలి డోసు తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్‌ టీకా ఇస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌ డీఎంఈ రమేశ్‌రెడ్డి శనివారం రెండో డోస్‌ తీసుకున్నారు. అలాగే టిమ్స్‌ డైరెక్టర్‌ విమలా థామస్‌కు వ్యాక్సిన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతోంది. గత నెల 16న కొవిడ్‌ తొలి డోస్‌ వ్యాక్సినేషనేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి డోస్‌ తీసుకున్న చోటే రెండో డోస్‌ వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే మొదట ఏ కంపెనీ డోస్‌ తీసుకుంటే మళ్లీ అదే కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు. మొదటి డోస్‌ తీసుకోని సిబ్బంది ఈ నెల 25లోగా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆ తర్వాత మొదటి డోస్‌ ఇచ్చే అవకాశం లేదని వైద్యా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.