మహిళా లెఫ్టినెంట్ జనరల్ గా మాధురి కనిత్కర్

Madhuri Kanitkar
Madhuri Kanitkar

న్యూఢిల్లీ: మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ పదోన్నతిలో భాగంగా అమె లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా గుర్తింపు పొందారు. భారత మిలటరీలో మాధురి కనిత్కర్ గత 37 సంవత్సరాలుగా పనిస్తున్నారు. సర్జన్ వైస్ అడ్మిరల్, భారత నావికాదళం, సైన్యంలో మాజీ 3స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ గా మాధురి కనిత్కర్ పని చేశారు. దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన మేజర్‌ జనరల్‌ మాధురి కనిత్కర్‌ అరుదైన ఘనత సాధించారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. త్రివిధ దళాల కోసం మొత్తం రక్షణ సముపార్జన ప్రణాళికను రూపొందిస్తూ, ఆయుధాలు, సామగ్రిని స్వదేశీకరించడాన్ని వీలైనంత వరకు సులభతరం చేయడం సీడీఎస్ ప్రధాన ఉద్దేశం. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/