మహమ్మారి వేగంగా అడుగులు వేస్తుంది..

ఇప్పుడు కరోనా మానవ సంక్షోభం… మున్ముందు మానవ హక్కుల సంక్షోభం కాబోతోంది: ఆంటోనియో గుటెర్రాస్

antonio guterres
antonio guterres

అమెరికా: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ అంటోనియో గుటెర్రాస్‌ ఓ సందేశం అందించారు. కరోనా ఇప్పుడు మానవ సంక్షోభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇది మానవ హక్కుల సంక్షోభంగా రూపుదాల్చుతుందని, ఆ దిశగా ఈ మహమ్మారి వేగంగా అడుగులు వేస్తోందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సహాయకచర్యలు, సేవల్లో వివక్ష కనిపిస్తోందని, కొన్ని వర్గాలకు సాయం అందడంలో నిర్మాణాత్మక అసమానతలు అడ్డుపడుతున్నాయని వివరించారు. కరోనా విపత్తు వేళ కొన్ని సామాజిక వర్గాలపై దుష్ర్పభావం పడుతోందని, విద్వేష ప్రసంగాలు చోటుచేసుకుంటున్నాయని, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం పెరుగుతోందని, భద్రతా పరమైన సమస్యలు ఆరోగ్య అత్యయిక స్థితిని మరుగున పడేస్తున్నాయని గుటెర్రాస్ ఆందోళనవ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/