మద్యం నిల్వలపై ఆరా తీస్తున్న ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్: తెలంగాణలో మద్యం నిల్వలపై ఎక్సైజ్ శాఖ వివరాలు సేకరిస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ స్టేషన్ల ఇంఛార్జీలకు అబ్కారీ శాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో నిల్వలు ఏ మేరకు ఉన్నాయో వివరాలు సేకరించాలని తెలిపింది. కేంద్రం కూడా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడంతో ఎక్సైజ్ స్టేషన్ ఇంఛార్జీల ద్వారా దుకాణాల వారిగా లిక్కర్, బీరు నిల్వలపై సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమీషనర్ ఆదేశించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/