మత్స్యకార భరోసా ఇస్తున్నందుకు ధన్యవాదాలు
సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు ఆర్ధిక సాయం ఇస్తుండడంపై రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా కారణంగా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేదం విధించారు. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా చితికిపోతున్నారు. ఈ సమయంలో వారికి మత్స్యకార భరోసా పథకం ద్వారా పదివేలు ఆర్ధిక సాయం ఇస్తున్నందుకు ధన్యవాధాలు. అదేవిధంగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, ట్యాక్సి డ్రైవర్లు, చిరు వ్యాపారులు, రిక్షా పుల్లర్లు బార్బర్లు, దర్జీలు, భవన నిర్మాణ కార్మికులు వీరితో పాటు తక్కువ ఆదాయ వర్గాలవారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా పదివేలు ఆర్ధిక సాయం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/