భారత్‌లో 24 గంటల్లో 72 మంది మృతి

మొత్తం కేసుల సంఖ్య 42,533..మొత్తం మృతుల సంఖ్య 1,373

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటలో దేశంలో కొత్తగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,553 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,373కి చేరింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,533కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 11,707 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/