భారత్లో భారీగా కరోనా కేసుల నమోదు
ఒక్కరోజులోనే 2,644 కేసుల నమోదు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా పంజా విసురుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గతంలో ఎన్నడు లేనంతగా ఒక్క రోజులొనే ఏకంగా 2,644 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటలలో ఏకంగా 83 మంది ఈ కరోనా మహామ్మారికి బలయ్యారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,301 కి చేరింది. ఇక ఇప్పటి వరకు దీని బారి నుండి 10,633 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 28,046మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/