భారత్‌లో కొత్తగా 11,067 మంది కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,58,371..మొత్తం మృతుల సంఖ్య 1,55,252

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11,067 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,087 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 94 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,252 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,61,608 మంది కోలుకున్నారు. 1,41,511 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 66,11,561 మందికి వ్యాక్సిన్ వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,33,24,655 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,36,903 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.