ఫ్యాక్టరీలోకి భారీ వరద..24 మంది మృతి

రబాట్‌: మొరాకోలో ఘోర ప్రమాదం సంభవించింది. దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముంచెత్తిన వరదలతో ఓ దుస్తుల తయారీ ఫ్యాక్టరీ పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 24 మంది కార్మికులు మరణించినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సోమవారం వెల్లడించింది. ఫ్యాక్టరీని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.