పోలీసులను సత్కరించిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు

పోలీసులు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్లనే కరోనా కేసులు తగ్గుముఖం

errabelli dayakar rao
errabelli dayakar rao

వరంగల్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తున్న పోలీసులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సత్కరించారు. ఈ రోజు ఉదయం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ రవీందర్‌ పై పూలవర్షం కురిపించి సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కేసులు భారీగా నమోదు అవుతాయన్న కారణంతో లాక్‌డౌన్‌ను విధించారు. ఈ లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేయడం వల్లనే నేడు తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ కార్యాక్రమంలో వరంగల్‌ మేయర్‌, కలెక్టర్‌ పాల్గోన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/