పది డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన పోచారం

హైదరాబాద్‌: దేశంలో 29రాష్ర్టాలు ఉంటే ఇళ్లు లేని పేదలకు అన్నివసతులతో వందశాతం సబ్సిడీపై డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణనే అని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ మండలం పులికుచ్చ తండాలో రూ. 50.40లక్షలతో నూతనంగా నిర్మించిన పది డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఈసందర్బంగా పోచారం మాట్లాడుతూ..గత ప్రభుత్వాల హయాంలో ఏదో నామ్‌కే వాస్తేగా డెబ్బయ్‌ వేల రూపాయలు ఇస్తేదానిని కూడా బినామీల పేరుతో బ్రోకర్లు దోచేసుకున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ‌దేనని అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఇల్లులేని పేదలందరికీ ఇల్లు కట్టించి స్వంత ఇంటి కల నెరవేరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.