పంట అమ్మకానికి నిబంధనలు అడ్డొస్తున్నాయా?
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
అమరావతి: ఏపి సర్కారుపై టిడిపి అధనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డు వస్తున్నాయా అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఏపిలో రైతులు తమ పంటలను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించడం లేదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో కడప జిల్లాలో ఓ రైతు తనపంటను అమ్ముకోలేక రోడ్డు పాలు చేసిన వీడియోను పోస్ట్ చేశారు. రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతుంది. కడప జిల్లా, గొల్లపల్లి గ్రామంలో, తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత భాధాకమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం? అంటూ ట్వీట్ చేశారు.
తాజ అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/