నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటన

సిరిసిల్ల: మంత్రి కెటిఆర్‌ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్న అమాత్యుడు, పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఒంటిగంటకు వీర్నపల్లి మండలం మద్దిమల్ల తాండాలో ఎంపీపీ మాలోతు బూల సంతోష్‌ కుటుంబాన్ని, మధ్యాహ్నం 2 గంటలకు గంభీరావుపేట మండలం సముద్రాలింగాపూర్‌లో సర్పంచ్‌ మోతె రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 2.30గంటలకు రాజేశ్వర్‌రావునగర్‌ కాలనీలో జీపీ భవనం, 3.30 గంటలకు గోరంటాలలో వైకుంఠధామం, పల్లె పకృతి వనాలను ప్రారంభించి, సా యంత్రం 4.30గంటలకు హైదరాబాద్‌ తిరుగు పయనమవుతారు. మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.