నేడు సిరిసిల్లలో పర్యటించనున్న మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ నేడు సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్నారు. గంభీరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు గంభీరావుపేటలో రైతువేదికను ప్రారంభిస్తారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు. అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నర్మాలలో రైతు వేదికను ప్రారంభిస్తారు. తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లింగన్నపేటలో రైతు వేదికను ప్రజలకు అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు మల్లారెడ్డిపేటలో రైతువేదిక ప్రారంభోత్సవానికి హాజరవుతారు.