నేడు ఉన్నతాధికారులతో ఏపి సిఎం కీలక సమావేశాలు
అమరావతి: ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అధికారులతో సాయంత్రం వరకు సమీక్షా సమావేశాలు జరపనున్నారు. ఏపిలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షా సమావేశం, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖపై సమీక్షా, అలాగే విశాఖ పట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై కూడా జగన్ సమీక్ష నిర్వహించి చర్చించనున్నారు. వీటిపై అధికారుల సమన్వయంతో పాటు పరిస్థితులను పర్యవేక్షించడానికి జగన్ సూచనలు చేయనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/