నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం అన్వేషణ

nallamala forest
nallamala forest

నాగర్‌కర్నూల్‌: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం బోరు పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల బృందం పర్యటించారు. ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాల వ్యతిరేక సంఘం నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇందులో భాగంగా యురేనియం వ్యతిరేక జేఏసి కన్వినర్‌ నాసరయ్యను ముందస్తు అరెస్టు చేయడంతో ఆయనను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా నల్లమలలో యురేనియం నిల్వల అన్వేషణకు కేంద్రం అనుమతినివ్వడంతో పలు ప్రాంతాలలో బోరుపాయింట్లు వేసి అన్వేషించారు. ఆ తరువాత ఆందోళనలు కొనసాగడంతో పలు ప్రాంతాలలో యురేనియం నిల్వల అన్వేషణను నిలిపివేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/