తెలంగాణ ఇంటర్‌ మోడల్‌ పేపర్స్‌ విడుదల

హైదరాబాద్‌: క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం విదిత‌మే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.