తెలంగాణలో కొత్తగా 151 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428.. మొత్తం మృతుల సంఖ్య 1,614

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా కొత్త‌గా 151 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. అదే సమయంలో 185 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,033 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,614గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,781 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 789 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 31 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.