తిరుమల శ్రీవారి ప్రత్యేకదర్శన టికెట్ల విడుదల

తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 19న రథసప్తమి సందర్భంగా 25 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి రోజుకు 5 వేల చొప్పున అదనపు టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. కరోనా కేసులు తగ్గుతుండటంతో దశల వారీగా దర్శన టికెట్లను పెంచుతూ వస్తున్నది. ప్రస్తుతం నిత్యం 50 వేల మంది వరకు స్వామిని దర్శించుకునేలా ఉచిత టోకెన్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తున్నది.