జూలై 25, 26వ తేదీల్లో ఉజ్జయినీ మహంకాళి బోనాలు

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఉజ్జయినీ మహంకాళి ఆలయ ఈవో గుత్త మనోహర్‌రెడ్డి ఆలయ వేద పండితులు, అర్చకులతో కలిసి ఆయన నివాసంలో కలిశారు. జూలై 11న అమ్మవారి ఘటోత్సవం, 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రి సమక్షంలో ప్రకటించారు. జూలై 25, 26వ తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించాలని మంత్రి తెలిపారు. దేవాలయ ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/