జగన్‌ ముందస్తు ప్రణాళిక వేసుకోలేదు

మద్యం షాపుల ముందు భారీగా జనం: చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ఏపిలో నేటినుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మద్యం ప్రియులు ఒక్క సారిగా మందు షాపుల ముందు వాలిపోయారు. వందల మీటర్ల మేర బారులు తీరారు. సామాజిక దూరం కూడా పాటించకుండా మద్యం కోసం వేచిచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు ఉన్న దృష్యాలను చూసి షాకయ్యాను. మద్యం షాపుల ముందు, మద్యం ప్రియులు భారీగా చేరుకునే అవకాశం ఉన్నప్పటికి జగన్‌ ముందస్తు ప్రణాళిక వేసుకోలేదు. సామాజిక దూరం పాటించే జాగ్రత్తలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/