జగన్‌పై ఈడీ కేసు విచారణ 22కు వాయిదా

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌పై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశామని, కాబట్టి ఈడీ కేసులపై విచారణను పది రోజులపాటు వాయిదా వేయాలని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అనుమతించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు కేసు విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

అలాగే, హెటిరో, అరబిందో వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సహ నిందితుడిని అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరడంతో విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే, సీబీఐ కేసులైన రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌లపై వాదనలు కొనసాగాయి.