క్వారంటైన్‌ నుంచి తప్పించుకున్న పాజిటివ్‌ వ్యక్తి బంధువు

-గురజాలలో గుర్తింపు

coronavirus precautions

కారంపూడి (గుంటూరుజిల్లా): కారంపూడిలో క్వారంటైన్‌లో ఉన్న పాజిటివ్‌ వ్యక్తి బంధువు ఒక మహిళ బుధవారం తప్పించుకుని పారిపోయింది.

దీంతో విషయం తెలుసుకున్న వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు సంబంధితమహిళ కోసం ఎక్కడ ఉందో అని వెతికారు.. కాగా ఆ మహిళను గురజాలలో గుర్తించారు..

ఆ మహిళను గుంటూరు కాటూరి ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తహశీల్దార్‌ శివనాగిరెడ్డి తెలిపారు.

ముసిసిపల్‌ సిబ్బంది ఆప్రాంతం మొత్తం బ్లాక్‌చేసి బ్లీచింగ్‌ను చల్లుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/