కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సిఎం కెసిఆర్ భేటి
టిఆర్ఎస్ కు స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
న్యూఢిల్లీ: సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు, పలు విషయాలపై ఆయనతో చర్చించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/