కరోనా నియంత్రణకు మార్గదర్శకాల విడుదల
ప్రతిఒక్కరూ పాటించాలని మోడీ ట్వీట్
New Delhi: భారత్ లో కరోనా వైరస్ తో ఇద్దరు మరణం, మరో 85 మంది వైరస్ భారీన పడటంతో కేంద్రం అప్రమత్తమైంది..ఒక వైపు కరోనా వ్యాధి గ్రస్తులకు అవసరమైన చికిత్స అందిస్తూనే, మరో వైపు ఈ వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను విడుదల చేసింది.. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపింది.. ప్రతి ఒక్కరూ ఈ స్వీయ నియంత్రణ పద్దతలు పాటించాలని ప్రజలను స్వయంగా మోడీ తన ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరారు..
కరోనా బాధితులను కలిస్తే…
- స్వీయ గృహనిర్బంధంలో భాగంగా వ్యక్తులు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే సింగిల్ రూమ్ లో ఉండాలి.
- ఆ గదికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటే మంచిది. ముఖ్యంగా, ఆ ఇంట్లో ఉన్న వృద్ధులకు గర్భవతులకు ఎడం పాటించాలి. పిల్లలు, ఇతరులతో కలివిడిగా ఉండరాదు.
- ఇంట్లో తన కదలికలను సదరు వ్యక్తి నియంత్రించుకోవాలి. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలావరకు నియంత్రించినవారవుతారు.
- ప్రాథమిక శుభ్రత గురించి చెప్పాల్సి వస్తే…. తరచుగా సబ్బుతో, శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- ఆ వ్యక్తి ఇంట్లోని ఇతర వస్తువులను కడగడం, అంట్లు తోమడం, దుస్తులు ఉతకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
- అన్నివేళలా మాస్కు ధరించాలి. ప్రతి 6 గంటలకు ఓ సారి మాస్కును మార్చుతుండాలి. ఓసారి వాడిన మాస్కును మరోసారి ధరించరాదు.
- కరోనా లక్షణాలు బయటపడ్డాయని భావిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించడం కానీ, 011-23978046 నంబరుకు ఫోన్ చేయాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- స్వీయ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కేవలం ఒక వ్యక్తి మాత్రమే పర్యవేక్షణ చేయాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తితో కరచాలనం చేయడం, నేరుగా తాకడం చేయరాదు.
- ఆ వ్యక్తి గదిని శుభ్రపరచాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించాలి.
- గ్లోవ్స్ తీసేసిన తర్వాత విధిగా చేతులు శుభ్రపరుచుకోవాలి.
- సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
- ఒకవేళ ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెల్లడైతే, ఆ వ్యక్తి సన్నిహితులను కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం తప్పనిసరి.
- ఆ వ్యక్తి గదిని 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
- టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్ దావ్రణాలతో పరిశుభ్ర పరచాలి.
- ఆ వ్యక్తి దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతకాలి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/