కరోనా చికిత్సకు ‘2డీఆక్సీ డీగ్లూకోజ్’ పొడి విడుదల
డాక్టర్ రెడ్డీస్ , డీఆర్డీఓ (INMAS) సంయుక్త తయారీ
New Delhi: కరోనా బాధితుల కోసం డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డీజీ (2డీఆక్సీ డీగ్లూకోజ్) ఔషధం విడుదలైంది. ఈ మందును సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో 10 వేల ప్యాకెట్ల(డోసుల)ను పంపిణీ చేస్తారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ మందును హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తోంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ 2 డీజీ పొడిని తయారు చేసింది.
కరోనా రోగులకు ఎమర్జెన్సీకి వాడవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మందు ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగవచ్చు. 2డీజీ మందుతో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, హాస్పిటల్ లో ఉండాల్సిన రోజులూ తగ్గుతాయని తెలిపారు. అన్ని వయసుల వారికి పని చేస్తుందని, పేషెంట్లలో రెండు మూడు రోజుల్లోనే తేడా కనిపించిందని నిపుణులు తెలిపారు.. మెడికల్ ఆక్సిజన్పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. మంచి ఫలితాలు ఇస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్ను అభివృద్ధి చేసింది. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని డీఆర్డీఓ పేర్కొంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/