కరోనాకు వ్యాక్సిన్‌ను తయారుచేశామన్న ఇటలీ

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలు..వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్

corona vaccine

ఇటలీ: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి. ఈతరుణంలో ఇటలీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా తాము కరోనా వైరస్‌కు టీకా తయారుచేసినట్టు ఇటలీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. రోమ్‌లోని స్పల్లాంజనీ ఆసుపత్రిలో దీనిని పరీక్షించినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ ప్రయోగంలో ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని టకీస్ సీఈవో లుయిగి ఆరిసిచియో అన్నారు. ఈ వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో ఒక్క డోస్ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, కరోనా వైరస్ మానవ కణాలకు సోకకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని అరిసిచియో ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/