ఏపిలో మరో 67 మందికి కరోనా పాజిటివ్‌

1717 కు చేరిన కరోనా భాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా విజృంభన తగ్గడం లేదు, రోజురోజుకు కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. గత 24 గంటలలో 8,263 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 67 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీనితో ఏపిలో కరోనా కేసుల సంఖ్య 1717 కు చేరుకుందని ఏపి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదు అయిన కేసులలో కర్నూలు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 13, కడప జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 1, విశాఖ పట్నం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు రాష్ట్రంలో చిక్కుకున్న గుజరాత్‌ వాసుల్లో మరో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా భారిన పడి 34 మంది మరణించగా.. 589 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 1094 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/