ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 16న ఎన్నికలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌: తెలంగాణ, ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపిలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో గడువు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆ స్థానాలకు మార్చి 14వ తేదీన ఎన్నికలు పెడుతున్నట్టు ప్రకటించింది. 17వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదీ షెడ్యూల్..

ఎన్నికల నోటిఫికేషన్జ ఫిబ్రవరి 16 (మంగళవారం)
నామినేషన్లకు గడువుజ ఫిబ్రవరి 23 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలనజ ఫిబ్రవరి 24 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు గడువుజ ఫిబ్రవరి 26 (శుక్రవారం)
పోలింగ్ తేదీ, సమయం జ మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)
ఓట్ల లెక్కింపు, ఫలితాలుజ మార్చి 17 (బుధవారం)

కాగా, తెలంగాణలో మహబూబ్ నగర్జ రంగారెడ్డిజ హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం బిజెపి నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్జ ఖమ్మంజ నల్గొండకు టిఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీలో తూర్పుజపశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి రాము సూర్యారావు, కృష్ణాజగుంటూరు నియోజకవర్గం నుంచి ఎ.ఎస్. రామకృష్ణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.