ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి
మృతుల్లో ఓ కమాండింగ్ ఆఫీసర్, ఓ మేజర్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. హంద్వారాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేయగా ఉగ్రవాదులు దాడికి దిగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు జరుగుతున్నాయి. ఇక మరణించిన జవాన్లలో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/