ఈరోజు మరోసారి ఈడీ ఎదుట ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈరోజు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో భాగంగా రోహిత్ ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఆయన్ను విచారించి పలు విషయాలు రాబట్టారు. ఈరోజు మరోసారి ఆయన్ను విచారించనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఈడీకి సంబంధం లేకున్నా తనకు నోటీసులు ఇచ్చి విచారించారని, ఈడీ విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టే సీబీఐని దింపుతున్నారనే అనుమానం కలుగుతున్నదని రోహిత్ రెడ్డి అన్నారు.
దొంగస్వాములు చెప్పినట్టే కేసు విచారణ ముందుకెళ్తున్నదని, ఇది తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కేసులో సీబీఐ విచారణే కరెక్ట్ అని కోర్టు చెప్తే విచారణకు సహకరిస్తానని చెప్పారు. ‘‘నన్ను జైల్లో పెట్టినా భయపడేది లేదు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్న. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నా లీగల్ టీం ఒపీనియన్ తీసుకుంటున్న” అని సోమవారం మీడియా తో తెలిపారు.
మాణిక్చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ను ఇప్పటికే విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. A2గా ఉన్న నందకుమార్ను ఇవాళ కూడా ప్రశ్నించనుంది ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నందకుమార్ నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.