ఇంగ్లాండ్ 2/ 140

క్రీజ్ లో జోరూట్ (45), డోమ్ సిబ్లి (53)

Joe root
Joe root

చెన్నై వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజు తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

జో రూట్ 45 పరుగులతోనూ, డోమ్ సిబ్లి 53 పరుగులతోనూ ఆడుతున్నారు. 33 పరుగులు చేసిన రాయ్ బర్న్స్ అశ్విన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి పంత్ కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు.

తొలి వికెట్ 63 పరుగుల వద్ద పడింది. తరువాత వచ్చిన లారెన్స్ బుమ్రా బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా డకౌట్ అయ్యాడు.