ఆర్ధిక పురోగతి వేగవంతంపై ఉన్నత సమావేశం

ఆర్ధిక పురోగతి వేగవంతంపై ఉన్నత సమావేశం
దేశంలో ఆర్థిక రంగం అనుకున్నంతగా వృద్ది సాధించకపోవడంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉన్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్ధిక పురోగతిని వేగవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరౌతారు.