అదుపుతప్పిన లారీ..ముగ్గురు మృతి

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

road accident
road accident

జడ్జర్ల: మహాబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల వద్ద జాతీయ రహదారి పై ఈరోజు ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లడం తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా వస్తున్న లారీ ఈ ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేలోగానే పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/