అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతుపై టికాయిత్‌ స్పందన

రిహానా, థ‌న్‌బ‌ర్గ్ ఎవ‌రో తెలియ‌దు.. కానీ ధ‌న్య‌వాదాలు!

న్యూఢిల్లీ: గత రెండు నెలలకే పైగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన సాగిస్తున్న రైతులకు ప్రముఖ పాప్‌ స్టార్‌ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ తదితరులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సరిహద్దులోని గాజీపూర్‌ వద్ద ఆందోళనలో పాల్గొన్న రాకేశ్‌ టికాయిత్‌ను మీడియా అడ‌గ్గా.. ఎవ‌రు ఈ విదేశీ క‌ళాకారులు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అప్పుడు మీడియా ప్ర‌తినిధులు వాళ్లెవ‌రో వివ‌రించ‌గా.. వాళ్లు మాకు మ‌ద్ద‌తు తెలిపి ఉండ‌వ‌చ్చు కానీ వాళ్లెవ‌రో నాకు తెలియ‌దు అని రాకేశ్ అన్నారు. కొంద‌రు విదేశీ వ్య‌క్తులు ఉద్య‌మానికి మ‌ద్దతు తెలుపుతుంటే స‌మ‌స్య ఏంటి. వాళ్లు మాకు ఏమీ ఇవ్వ‌డం లేదు. మా నుంచి ఏమీ తీసుకోవ‌డం లేదు అని రాకేశ్ తికాయిత్ చెప్పారు.