సుర్యాపేటలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన!

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సూర్యాపేటలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనం..పోలీసు కార్యాలయాల భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వట్టికం పహాడ్లో 400 కేవీ సబ్స్టేషన్ను, చందుపట్లలో మిషన్ భగీరథ ప్లాంట్ను ప్రారంభించనున్నారని వారు తెలిపారు.