సికింద్రాబాద్-కోఠి మార్గంలో 40 సర్వీసులకు జీపీఆర్ సర్వీస్

హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సమాచారం తెలిపేందుకు కొత్త చర్యలు ప్రారంభించామని రవాణా శాఖ మంత్రి
మహేందర్రెడ్డి తెలిపారు. పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రయాణికులకు బస్సులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలుస్తుందని అన్నారు.
అలాగే జీపీఆర్ సర్వీస్ ద్వారా ప్రయాణికులకు బస్సుల రాకపోకల వివరాలు తెలుస్తాయని, సికింద్రాబాద్-కోఠి మార్గంలో 40 సర్వీస్లకు దీనిని
ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.