శాశ్వతంగా మనమే తొలి స్థానంలో ఉంటాం

అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటిస్థానంలో ఉన్నామని, శాశ్వతంగా మనమే తొలిస్థానంలో ఉంటామని సియం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం వేతనాలు పెంచినందుకు గాను సియం చంద్రబాబును అంగన్వాడీ, ఆశావర్కర్లు సన్మానించారు. ఈ సందర్భంగా సియం మాట్లాడుతూ అంగన్వాడీలు, ఆశావర్కర్లు సంఘటితం కావాలని అన్నారు. శాశ్వత అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లకు చంద్రన్న భీమా వర్తింపజేస్తామని సియం ప్రకటించారు. ఆగస్టు 15లోపు అంగన్వాడీ, ఆశావర్కర్లకు సెల్ఫోన్లు ఇస్తామన్నారు. కేంద్రం సహకరించకపోయినా నిలదొక్కుకునే శక్తి వచ్చిందంటే కారణం ప్రజల సహకారమే అని సియం చంద్రబాబు పేర్కొన్నారు.