మెదక్ ను సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించిన హరీష్రావు

మెదక్: బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సంపూర్ణ జిల్లాగా మెదక్ను ప్రకటించారు. మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణ ఓడీఎఫ్ జిల్లాగా మెదక్ను ప్రకటించారు. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు పూర్తి ఓడీఎఫ్ జిల్లాలుగా ప్రకటించగా తాజాగా ఆ జాబితాలో మెదక్ జిల్లా చేరింది.