భారత్లో మరో భారీ వ్యాపారానికి సిద్ధమైన గూగుల్!

ఢిల్లీ: భారతదేశంలో మరో భారీ వ్యాపారానికి గూగుల్ తెరతీసింది. గూగుల్కు ఇప్పటికే భారత్ అత్యంత విలువైన వినియోగదారుడిగా
ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత మన దేశంలో పేమెంట్ యాప్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పేమెంట్ యాప్ను
లాంచ్ చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. మనదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్లోకి గూగుల్
అడుగుపెట్టబోతోందని, సెప్టెంబర్18న ఈ యాప్ను లాంచ్ చేయనుందని, ఈ డిజిటల్ పేమెంట్ సర్వీస్ను ‘తేజ్ పేరుతో రానుందని
దికెన్.కామ్ వెబ్సైట్ తెలిపింది.