నిరాహారదీక్ష పేరుతో రాజకీయ పార్టీలు డ్రామాలు

ముంబై: బిజెపి, కాంగ్రెస్లపై శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ మధ్య జరుగుతున్న పార్టీల నిరహారదీక్షలపై శివసేన విరుచుకుపడింది. దేశంలో రైతులంతా తినటానికి తిండి లేక చచ్చిపోతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం నిరాహార దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించింది. దీక్షలకు ముందు, దీక్షల తర్వాత ఈ రెండు పార్టీల నేతలు ఆహారం తీసుకుంటున్న ఫోటోలను శివసేన పత్రిక సామ్నాలో ప్రచురించింది. నిరాహార దీక్షల వల్ల వారు ఏమీ సాధించలేకపోయారు. ఆకలి బాధలతో రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని ,ఒక్క మహారాష్ట్రలోనే బిజెపి పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పింది.