డ్రగ్స్ వ్యవహారంపై నోరు విప్పని బోయపాటి శ్రీను

విజయవాడ: సినీ పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహరంపై పలువురు సినీ ప్రముఖులు పలు రకాలుగా
స్పందించిన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం దీనిపై స్పందించుటకు
నిరాకరించారు. మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయనను డ్రగ్స్ వ్యవహారంపై మీ
స్పందన ఏంటీ? అని మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించలేదు. ఇకా తన దర్శకత్వంలో తెరకెక్కిన
‘జయ జానకి నాయక సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు.