టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగింది!

కరీంనగర్: తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ ఈరోజు కరీంనగర్ పర్యటనకు వచ్చిరు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతు నిరంకుశ ప్రభుత్వాని కూల్చడమే తమ లక్ష్యమని, పొత్తు విషయమై మహాకూటమిలో చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతా సవ్వంగా జరిగితే సీట్లపై చర్చిస్తామని ఆయన చెప్పారు. టిఆర్ఎస నాలుగేళ్ల పాలనల్లో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే ధూమ్ ధామ్ కార్యక్రమమని ఆయన అన్నారు. ఈనెల 4న సిద్దిపెట నుండి పోరుయాత్ర ప్రారంభమవుతుందని, అక్టోబర్ 10న వరంగ్లో ముగింపు సభ జరుగుతుందని కోదండరామ్ తెలిపారు
.