కెప్టెన్గా 5 వేల రన్స్ చేసి రికార్డు

బెంగుళూరుః టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇప్పటివరకూ టీ20ల్లో కెప్టెన్గా 5 వేల రన్స్ చేసిన తొలి బ్యాట్స్మన్గా ,ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో 70 రన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన మహి.. ఈ రికార్డును తనపేరిట రాసుకున్నాడు. ధోనీ కేవలం 34 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అటు రాయుడు కూడా 53 బంతుల్లో 82 పరుగులు చేయడంతో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చెన్నై చేదించింది.