కుడి కాలువ నుంచి సాగునీరు విడుదల

అమరావతి: సాగర్ కుడికాలువ ఆయకట్టు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కుడికాలువ నుంచి సాగునీరు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు శనివారం ఉదయం నీరు విడుదల చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉమా, అధికారుల భేటీ అయ్యారు. రైతులు వరి పంట వేసుకునేందుకు ఈ సందర్భంగా అనుమతి ఇచ్చారు.