రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

pm-modi-to-flag-off-rajasthans-first-vande-bharat-express-

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈరోజు ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ టెరిటరీలో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్ ప్యాసింజర్ రైలు కానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మార్గంలో నడుస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఒక గంట ముందుగానే ఈ రైలు ప్రయాణం పూర్తి అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు.

కాగా, ప్రారంభ పరుగు జైపూర్- ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య ఉంటుంది.ఈ రైలు అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్, జైపూర్, అల్వార్ ,గురుగ్రామ్‌లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ – అజ్మీర్ మధ్య దూరాన్ని 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది.ఈ రైలు పుష్కర్, అజ్మీర్ దర్గాలతో సహా రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు చెప్పారు.