|
దానంపై మణెమ్మ ధ్వజం, భిక్షపతి ఆగ్రహం ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిమిత్తం అభ్యర్థుల ఎంపిక సందర్భంగా టిక్కెట్లుఅమ్ముకున్నారనినగర నాయ కత్వంపై పలు ఆరోపణలు వచ్చాయి. లక్షలాది రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేం దర్పై నేరుగా ఆరోపణలు చేస్తూ ముషిరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ గురువారం అర్ధరాత్రి ధర్నా చేశారు.
నాగేందర్ ఇంటి ముందే తన అనుచరు లతో ధర్నా చేయడంతో పాటు ఆయనతో నేరుగా వాదులాటకు దిగారు. బోలక్పూర్, కవాడిగూడ, బాగ్లింగంపల్లి, ముషిరాబాద్ తదితర డివిజ న్లతో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని, ఇందులో లక్ష లాది రూపాయలు తారుమారయ్యాయన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని, దానంను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
రమ్యాగ్రౌండ్ వద్ద డిఎస్ దిష్టిబొమ్మ తగల పెట్టగా, కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వసం చేయడంతో పాటు తగలపెట్టారు. తాము కోరుకున్నవారికి టిక్కెట్లు రాలేదని వడ్డేపల్లి నర్సింగ్రావు ఆను చరులు ఈ విధ్వంసానికి దిగారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వైఎస్ జగన్కు సన్ని హితంగా ఉండే సుధీర్రెడ్డి (ఎల్.బి.నగర్) తన వెంట కోన శ్రీశైలం గౌడ్(కుత్బుల్లాపూర్), భిక్షపతి యాదవ్(శేర్లింగంపల్లి), రాజిరెడ్డి(ఉప్పల్) తది తర ఎమ్మెల్యేలను పెట్టకుని గురువారం మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు ఒక హోటల్లో సమావేశమై భవిష్యత్తుకార్యక్రమాన్ని రూపొందిం చుకున్నారు. తాము అనుకున్న వారికి టిక్కెట్లు రాకపోతే, స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచించారు. వారి భావించినట్లుగానేటిక్కెట్లు రాకపోవడంతో ఆందోళనకు సన్నద్ద మవుతున్నారు. వీరితో పాటు సమావేశమైన వడ్డే పల్లి నర్సింగ్రావు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తనతో పాటు తన అనుచరులకు డివిజన్ టిక్కెట్లు కోరుకున్నారు. అయన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపో యారు. కాగా,మల్కాజ్గిరిఎమ్మెల్యేఆకుల రాజేం దర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ కూడా వారి బాటలోనే ఉన్నారు.వారు సుధీర్రెడ్డికి ఫోన్ చేసితాముకోరుకున్నవారికిటిక్కెట్లు రాలేదన్నారు.
|