మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఎమ్మెల్యేలు... రిసార్టుల నుంచి బయటికి రండి వరద బాధితులను ఆదుకోండి: యెడ్యూరప్ప
భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:01 [IST]

yadyurappaబళ్ళారి నవంబర్‌ 3 ప్రభాతవార్త: ఉత్తర కర్ణాటకలో అతిృష్టి కారణంగా అపార నష్టం వాటిల్లి ప్రజలు హహాకారాలు చేస్తున్నారు. వారిని ఆదుకునేందుకు వీలుగా హైదరాబాద్‌,గోవా రిసార్టులలో ఉన్న ఎమ్యెల్యేలు తక్షణం తమ తమ నియోజక వర్గాలకు చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్‌ యెడ్యూ యూరప్ప ఆదేశించారు. తోరణగల్లు సమీపంలోని జిందాల్‌ అతిథిగృహంలో రాత్రి బస చేసిన ఆయన మంగళవారం బీజాపుర జిల్లా వెళ్ళే ముందు విలేకరులతో మాట్లాడారు.

వరదలు అతివృష్టి వల్ల గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే ప్రభువులని, వారికి చేయూతనందించి సహకరించాల్సిన ఎమ్యేల్యేలు రిసార్టులలో ఉండటం సమంజసం కాదని అన్నారు. నిరాశ్రితులను ఆదుకునే విషయమై ఎమ్యేల్యేలు స్పందించకపోతే ఈనెల 6తర్వాత తాను ప్రజల మధ్యకు వెళ్ళవలసి వస్తుందని హెచ్చ రికలు జారీ చేసారు.జగదీశ్‌శెట్టర్‌ను స్పీకర్‌ చేసింది తాను కాదు పార్టీ హైకమాండ్‌, ఆయన్ను మంత్రి గాకూడా హైమాండే చేస్తుంది,అయితే ఈ విష యంలో కొంత ఆలస్యం జరిగింది నిజమే అంత మాత్రాన ఇంత గందరగోళం సృష్టించాల్సిన అవసరంలేదని యడియూరప్ప అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇప్పటికైన శెట్టర్‌ వాస్తవాలు తెలుసు కోవాలని అన్నారు. ఈనెల 5వ తేదీన ఢిల్లీ వెళ్ళి ప్రధాన మంత్రిని కలిసి అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తామన్నారు.

అధికారం చేపట్టే సమయంలో జనార్దనరెడ్డి సోదరుల సహకారం తీసుకున్నాను. ప్రస్తుతం టైం సరిగా లేక ఏర్పడిన గందరగోళాన్ని నివారించేందుకు పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారు. అనంత్‌కుమార్‌ ఇందుకు నాయ కత్వం వహించి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం అభివృద్ధి పట్ల శ్రద్ద వహించాలని సూచించింది. అందుకే పార్టీలో నెలకొన్న భేదాభిప్రాయాల విషయమై ఆలోచించడం లేదన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com