మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 4:41 AM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
'కొండపైకి 'కొండా పయనం
మంగళ వారం, నవంబర్ 03, 2009 , 10:56 [IST]

konda surekhaఆత్మకూరు, నవంబర్‌ 2, ప్రభాత వార్త: వైఎస్‌రాజ శేఖరరెడ్డి పట్ల తనకున్న కృతజ్ఞతాభావాన్ని మంత్రి పదవికి రాజీనామ సమర్పించడం ద్వారా ప్రకటిం చుకున్న శాయంపేట ఎంఎల్‌ఏ కొండా సురేఖ వేలాది మంది అనుచరులతో వందలాది వాహనాల్లో సోమవారం కర్నూలు జిల్లా ఆత్మ కూరు అటవీ డివిజన్‌లోని చింతగుండం తిప్పకు వచ్చారు. పవిత్రమైన కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో చింతగుం డంతిప్ప మార్గంలో వున్న రుద్రకోడు దివ్యక్షేత్రానికి సుమారు 30వేల మంది యాత్రికులు చేరుకు న్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాలతో అడవి దారి రద్దీగా మారింది.

ఈ పరిస్థితుల్లో సాయం త్రం 4.30 గంటలకు కొండా సురేఖ వాహనశ్రేణి నల్లమ లలో ప్రవేశించింది. గాలేరు సమీపానికి ఈవాహన శ్రేణి వెళ్లే సరికి మార్గం ఇరుకుగా వుం డటంతో ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచి పోయాయి. దీంతో పోలీసులు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీని ఓ వాహనంలో ముం దుకు పంపారు.

దీంతో వరంగల్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి సుమారు 250 వాహ నాల్లో  వచ్చిన అభిమానులు చింతగుండం వరకు వెళ్లలేక పోయారు. నడిచి వెళ్లాలన్నా వాహనాలు నిలిచిన ప్రదేశానికి చింతగుండం సుమారు 18 కిమిల దూరం ఉండటం అప్పటికే చీకటి పడటం వంటి అంశాల వల్ల సాధ్యం కాలేదు. చీకట్లోనే కొండా సురేఖ,ఆమె భర్త మురళీ చింత గుండం తిప్పను అతికొద్ది మంది అనుచరులతో అధిరో హిం చారు.

తిప్పపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేలకూలి మరణించిన ప్రదే శంలో ఆమె తన వెంట తీసుకెళ్లిన రాజీనామ పత్రాన్ని వుంచి మౌనంగా నివాళులు అర్పిం చారు. ఎంఎల్‌సి కొండామురళీ ఉద్వేగభరితంగా నినాదా లిచ్చారు. ఆర్భాటంగా జరుగు తుంద నుకున్న కొండా దంపతుల కొండయాత్ర ఇలా యాంటిక్లైమా క్స్‌కు చేరుకుంది. ప్రణాళి కబ ద్దంగా ఈ ప్రతి ష్టాత్మకమైన యాత్రను ఏర్పాటు చేసు కోక పోవడం సమస్యలకు కారణ మైంది. చింత గుండం ప్రయాణం ఎప్పుడైనా మధ్యాహ్నం 2 గంటలలోపే అడవిలోకి వెళ్లేలా ప్లాన్‌ చేసు కోవాలి. అది భారీగా జనాలతో, వాహ నాలతో వెళ్లాలనుకున్నప్పుడు మరింత శ్రద్దగా దారులను సరిచేసుకుని, వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయ కుండా నెమ్మదిగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకో వాల్సివుంది.

ఈ జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అడవిలోని గాలేరు సమీపంలో వాహన శ్రేణిలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోవడం వల్ల ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో కొండా దంపతులు మాత్రము ట్రాఫిక్‌ ఆవల వున్న ఓ తవెరా వాహ నంలోవెళ్లేలా పోలీసులుఏర్పాటు చేయ గలిగారు. రాత్రి 7 గంటలకు కాని కొండా దంప తులుచిం తగుండం తిప్పకు చేరుకోలేకపో యారు. చీకట్లో గుండ్ల రస్తాలో ఇబ్బందులు పడుతూ కొండ ఎక్కితాము అనుకున్న పనిని కొండా దంపతులు అయిందనిపించారు.వీరివెంటవచ్చిన అభిమాను లకు ఆత్మకూరు పట్టణం లోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో భోజన సౌకర్యం కల్పించారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 థర్డ్‌ జనరేషన్‌ (3జి) ప్రారంభించిన..
 పర్యావరణ మార్పులతో పంట నష్టం :..
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com